harish shankar: షికారు చేస్తున్న పుకార్లు .. క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్

  • పూజా హెగ్డే పారితోషికం వార్తలో నిజం లేదు 
  • నా తదుపరి సినిమాను పవన్ తో చేయడం లేదు
  • అధికారిక ప్రకటన చేసేవరకూ వేచి వుండండి  

ప్రస్తుతం హరీశ్ శంకర్ .. వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'వాల్మీకి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకుగాను ఆమె 2 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇది కేవలం పుకారు మాత్రమేననీ, ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తాజాగా హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్ తదుపరి సినిమా పవన్ కల్యాణ్ తో ఉండనున్నట్టుగా కూడా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక నిర్మాత నుంచి గతంలో అడ్వాన్స్ తీసుకున్న పవన్, ఆయనకి ఆ సినిమా చేసి పెట్టనున్నాడనీ .. ఆ సినిమాకి దర్శకుడు హరీశ్ శంకర్ అని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై కూడా హరీశ్ శంకర్ స్పందిస్తూ, ఇది కూడా పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. తన సినిమాలకి సంబంధించిన వివరాల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పాడు.

More Telugu News