Tirumala: వారం రోజుల్లో పరకామణి వెండి నిల్వల లెక్కింపు పూర్తి.. టీటీడీ ప్రత్యేక దృష్టి

  • ఒక అప్రైజర్‌తోపాటు 30 మంది మజ్దూర్‌ల నియామకం
  • సత్వరం లెక్కింపు పూర్తి చేయాలని ఈవో సింఘాల్‌ ఆదేశం
  • ఇప్పటికే పూర్తయిన నాణాల లెక్కింపు

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో పనిచేస్తున్న 40 మంది మజ్దూర్‌లను గుట్టుచప్పుడు కాకుండా తొలగించడంతో నిలిచిపోయిన ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. పరకామణిలో నోట్ల లెక్కింపు తప్ప మిగిలిన ఆదాయం లెక్కింపు నిలిచిపోయిందని, భారీ ఎత్తున నిల్వలు పేరుకుపోతున్నాయని వచ్చిన విమర్శలతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రత్యేక సిబ్బందిని నియమించి ఇప్పటికే నాణాల నిల్వల లెక్కింపు పూర్తిచేసిన అధికారులు తాజాగా వెండి నిల్వల లెక్కింపును వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఒక అప్రైజర్‌తోపాటు 30 మంది మజ్దూర్‌లను నియమిస్తూ దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా వెండి నిల్వల లెక్కింపు మొత్తం పూర్తికావాలని ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News