Mahesh Babu: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే 
  • 'మహర్షి'కి సెన్సార్ క్లీన్ సర్టిఫికేట్ 
  • ప్రభాస్ 'సాహో' అప్ డేట్

*  వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'వాల్మీకి' చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నట్టు సమాచారం. పదిహేను రోజుల కాల్షీట్ల కోసం ఆమె చాలా అడిగినప్పటికీ, చివరికి ఓకే చేసుకున్నట్టు తెలుస్తోంది.
*  మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన 'మహర్షి' చిత్రం సెన్సార్ పూర్తయింది. కట్స్ ఏమీ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 9న రిలీజ్ చేస్తున్నారు.
*  ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'సాహో' చిత్రానికి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఇక మిగిలి వున్న ఒక్క పాటనూ త్వరలో యూరప్ లో చిత్రీకరిస్తారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తారు.

More Telugu News