Odisha: ఒడిశా ప్రభుత్వం ఆర్టీజీఎస్‌ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పడం సంతోషం: సీఎం చంద్రబాబు

  • ఆర్టీజీఎస్ కు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలపై స్పందన
  • ఇలాంటి ప్రశంసలు ఉత్సాహాన్ని ఇస్తాయి
  • మరింత ఉత్సాహంగా పని చేసే స్ఫూర్తి నిస్తాయి

‘ఫణి’ తుపాన్ కు సంబంధించి తమకు అద్భుత సమాచారం అందించిన ఆర్టీజీఎస్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఆర్టీజీఎస్‌ అందించిన సమాచారం కారణంగానే ముందస్తు చర్యలు తీసుకోగలిగామని ఒడిశా ప్రభుత్వం, రైల్వే శాఖ‌ పేర్కొనడం.. ఆర్టీజీఎస్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి ప్రశంసలు మరింత ఉత్సాహంగా పని చేసే స్ఫూర్తి నిస్తాయని అన్నారు.

More Telugu News