Police: కాపురంలో చిచ్చుపెట్టిన సెల్ ఫోన్... ఇల్లొదిలి వెళ్లిపోయిన భార్య!

  • మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతున్న భార్య
  • భర్త మందలించడంతో మనస్తాపం
  • మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఓ జంట కాపురంలో సెల్ ఫోన్ చిచ్చుపెట్టింది. పదేపదే ఫోన్ ను అంటుకుపోయి ఉన్న భార్యను మందలించగా, మనస్తాపంతో ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. కర్ణాటకలోని హోసూరు సమీపంలోని బాగలూరు పోలీస్‌ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు హొసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్‌ రాజ్‌, శిల్పలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

శిల్ప మరో వ్యక్తితో నిత్యమూ సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుతూ ఉండడంతో, భర్త తరచూ గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గత నెల 26న బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. అందరు బంధువుల ఇళ్లలో గాలించినా ఆమె జాడ తెలియలేదు. దీంతో ప్రేమ్‌ రాజ్‌ బాగలూరు పోలీసులను ఆశ్రయించగా, మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News