nizamabad: నిజామాబాద్ లో జంట హత్యల కలకలం!

  • స్థానిక కంఠేశ్వర్ కాలనీలో ఘటన
  • గది నుంచి దుర్వాసన రావడంతో బయటపడ్డ సంగతి
  • ఈ హత్యలు రెండు రోజుల క్రితం జరిగినట్టు అనుమానం

నిజామాబాద్ లో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. స్థానిక కంఠేశ్వర్ కాలనీలోని ఓ ఇంట్లో ముగ్గురు యువకులు నివాసం ఉంటున్నారు. ఆ యువకులు నివసిస్తున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఆ ఇంటి యజమాని గది తలుపులు తీసి చూడటంతో ఈ హత్యల సంగతి బయటపడింది. రెండు రోజుల క్రితం ఈ హత్యలు స్థానికుల అనుమానం. మరో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగు నెలల నుంచి ఆ ఇంట్లో ఈ ముగ్గురు యువకులు అద్డెకు నివసిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు నిజామాబాద్ లో టీ స్టాల్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News