Rajanikant: రజనీకాంత్ చిత్ర బృందంపై విద్యార్థుల దాడి... మురుగదాస్ సీరియస్!

  • దర్బార్ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • కాలేజీలో సీన్లు తీస్తుండగా షూట్ చేసిన విద్యార్థులు
  • అడ్డుకోవడంతో వాగ్వాదం, గొడవ

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రంలో నటిస్తుండగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో భాగంగా ఓ కాలేజీలో సీన్లు తీస్తుండటంతో, విద్యార్థులు వారిపై రాళ్లదాడికి దిగారు. సినిమా షూటింగ్ ను చూసేందుకు వచ్చిన విద్యార్థులు, తమ సెల్ ఫోన్లలో అక్కడి దృశ్యాలను తీస్తుండటంతో, యూనిట్ సభ్యులు వారిని అడ్డుకున్న వేళ, తొలుత వాగ్వాదం, ఆపై రాళ్లదాడి జరిగాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన మురుగదాస్, తన సినిమా ఫొటోలు లీక్ కావడంతో తీవ్ర అసంతృప్తికి లోనై, వెంటనే లొకేషన్ మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

More Telugu News