raj tarun: మరో రొమాంటిక్ లవ్ స్టోరీలో షాలినీ పాండే

  • 'అర్జున్ రెడ్డి'తో షాలిని పాండేకి క్రేజ్ 
  • '118' మూవీతో మరో సక్సెస్ 
  • రాజ్ తరుణ్ జోడీగా ఛాన్స్

'అర్జున్ రెడ్డి' సినిమాలో కథానాయికగా షాలినీ పాండే పెద్దగా మేకప్ లేకుండానే కనిపించి కుర్రకారు మనసులను దోచేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి వరుస సినిమాలతో దూసుకుపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా సక్సెస్ తరువాత అంతగా గుర్తింపు లేని పాత్రలను ఎంచుకుని వెనుకబడిపోయింది. ఇటీవల వచ్చిన '118' చిత్రంలో మాత్రం గ్లామర్ పరంగా బాగానే సందడి చేసింది.

అలాంటి ఈ సుందరికి తాజాగా మరో ప్రేమకథలో అవకాశం దక్కింది. రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అవికా గోర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి షాలినీ పాండేను తీసుకున్నారా? లేదంటే అవికాతో పాటు షాలినీని తీసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. 

More Telugu News