Manchu Vishnu: నాలుగో బిడ్డకు ఆహ్వానం పలుకుతున్న మంచు విష్ణు!

  • ప్రస్తుతం వినీ గర్భిణి  
  • నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుంది
  • ట్విట్టర్ లో వెల్లడించిన మంచు విష్ణు

మంచు వారింట్లోకి మరో నూతన అతిథి రానున్నాడు. విష్ణు నాలుగో బిడ్డకు తండ్రి కానున్నాడు. ఆయన భార్య వినీ ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇక ఇదే విషయాన్ని తొలిసారిగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన మంచు విష్ణు, "ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. అరి, వివి, అవ్రామ్ ల తరువాత నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా" అని అన్నాడు. విష్ణు దంపతులకు తొలుత అరియానా, వివియానా కవలలు, ఆ తరువాత అవ్రామ్ అనే బాబు జన్మించాడన్న సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణుకు పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు.

More Telugu News