India: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఇంటికే కన్నం వేసిన దొంగ!

  • టీవీ సహా విలువైన వస్తువుల చోరీ
  • ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఘటన
  • ఇంటిని అద్దెకు ఇచ్చిన ధోని

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో దొంగతనం జరిగింది. యూపీలోని నోయిడాలో ఉన్న సెక్టార్ 104లో ఉన్న ఓ ఇంటిని ధోని గతంలో కొన్నారు. ఇటీవల దీన్ని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అయితే విక్రమ్ ఇంటిలోకి ఇంకా చేరలేదు. ఈ క్రమంలో గత నెల 29న ఇంటికి విక్రమ్ రాగా, ఇంటి తాళం పగులగొట్టి ఉంది.

దీంతో ధోనికి సమాచారం ఇచ్చిన విక్రమ్.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇంట్లో ఖరీదైన ఎల్ఈడీ టీవీతో పాటు కొన్ని వస్తువులు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News