vijay: విజయ్ .. విక్రమ్ లతో శంకర్ భారీ మల్టీ స్టారర్

  • భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ 
  • ముందుకు కదలని 'భారతీయుడు 2' ప్రాజెక్టు
  • ఆగిపోయిందంటూ జోరుగా ప్రచారం  

శంకర్ సినిమాలు భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందుతుంటాయి. కొంతకాలంగా ఆయన ఆసక్తికరమైన కథాకథనాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కమల్ తో 'భారతీయుడు 2' చేయడానికి రంగంలోకి దిగారు. అయితే ఈ ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కిందిగానీ .. ముందుకు మాత్రం కదలడం లేదు. దాంతో ఆగిపోయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఆ వార్తలకి బలాన్ని చేకూరుస్తూ ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను లైన్లో పెట్టడానికి శంకర్ ప్రయత్నాలు ప్రారంభించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఆయన విజయ్ .. విక్రమ్ లతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు. నిజానికి ఇది 'భారతీయుడు 2' తరువాత చేద్దామని శంకర్ అనుకున్న ప్రాజెక్టు అనీ, ఆ ప్రాజెక్టు ఆగిపోవడం వల్లనే శంకర్ ఈ కథను బయటికి తీశాడని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

More Telugu News