Tollywood: అనాథ పిల్లలతో కలిసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్!

  • హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో చూసిన నటుడు
  • పిల్లలంతా సినిమాను ఎంజాయ్ చేశారని వ్యాఖ్య
  • వారందరికీ తలో మొక్కను అందజేస్తున్నామని వెల్లడి

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈరోజు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూశారు. కొంతమంది అనాథ పిల్లలతో పాటు తన స్నేహితుడు నవీన్, సోదరుడు వైష్ణవ్ తో కలిసి హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలంతా సినిమాను బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు.

ఈ విషయంలో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ఈ పిల్లలకు సామాజిక బాధ్యత తెలియజేయాలన్న ఉద్దేశంతో వాళ్లందరికి చిన్నచిన్న మొక్కలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ పిల్లలు సినిమా చూసేందుకు సహకరించిన మేనేజ్ మెంట్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News