Chandrababu: నా దగ్గర ఉన్న సమాచారం తీసుకునే జీవీఎల్ పుస్తకం రాశారు: చంద్రబాబు

  • ఈవీఎంలపై నా వద్ద నుంచి జీవీఎల్ సమాచారం తీసుకున్నారు
  • ఇప్పుడు అదే ఈవీఎంలను సమర్థిస్తున్నారు
  • హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి

ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈవీఎంల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశారని... ఇప్పుడు అదే ఈవీఎంలను ఆయన సమర్థిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లో ఏడు దశల్లో ఎన్నికలు పెట్టడం దారుణమని... హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పోరాటం వల్లే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు 5 శాతానికి పెరిగిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి పడ్డాయని తెలిపారు. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పారు.

More Telugu News