Mahesh Babu: 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథులుగా వెంకీ - విజయ్ దేవరకొండ

  • ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వేదికగా 'పీపుల్స్ ప్లాజా'        
  • మే 9వ తేదీన సినిమా విడుదల  

 వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజున ప్లాన్ చేశారు. హైదరాబాద్ .. నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ వేడుకకి వెంకటేశ్ .. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ వేడుకలో.. ఈ వేదికపైనే రాత్రి 8 గంటల 10 నిమిషాలకి ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ట్రైలర్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

More Telugu News