puri: ఆ దర్శకుడితోనే ఆకాశ్ పూరి తదుపరి సినిమా?

  • 'మెహబూబా'తో ఆకాశ్ కి ఫ్లాప్
  • సెట్స్ పై 'రొమాంటిక్'
  • తదుపరి సినిమాకి సన్నాహాలు

ఒకవైపున దర్శకుడిగా తను హిట్ ను అందుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున తన తనయుడైన ఆకాశ్ ను హీరోగా నిలబెట్టడానికి పూరి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆకాశ్ హీరోగా తను తెరకెక్కించిన 'మెహబూబా' పరాజయంపాలు కావడంతో, ఆ తరువాత సినిమా దర్శకత్వ బాధ్యతలను తన శిష్యుడైన అనిల్ పాడూరికి పూరి అప్పగించాడు. 'రొమాంటిక్' పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా పూరి లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఈ సినిమాకి మల్లికార్జున్ దర్శకుడిగా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. గతంలో కల్యాణ్ రామ్ హీరోగా ఈ దర్శకుడు తెరకెక్కించిన 'అభిమన్యు' .. 'కత్తి'.. 'షేర్' పెద్దగా ఆడలేదు. అయినా ఆయన వినిపించిన కథ నచ్చి పూరి ఓకే చేశాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

More Telugu News