lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు రేపు ముహూర్తం పెట్టుకున్న వర్మ.. విడుదలపై ఉత్కంఠ

  • రేపు సినిమా విడుదల చేస్తామని ప్రకటించిన దర్శక, నిర్మాతలు
  • ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు కుదరదన్న ఈసీ
  • సినిమా విడుదలపై సర్వత్ర ఆసక్తి

ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రేపు (మే1) విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే సినిమా విడుదలకు వారు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి చిత్రాలు విడుదల చేయవద్దని ఈ నెల 10న ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలపై ప్రభావం చూపే బయోపిక్ లను ప్రదర్శించరాదని ఈ ఆదేశాల్లో ఉంది. తమ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మరో ఉత్తర్వును విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో, కోడ్ అమల్లో ఉండే మే 23 వరకు ఈ సినిమాను విడుదల చేయడం కుదరదు. ఈ క్రమంలో, సినిమా విడుదలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

More Telugu News