Hazipur: హాజీపూర్ గ్రామం నుంచి పరారైన శ్రీనివాస్ రెడ్డి కుటుంబం!

  • వ్యవసాయ బావిలో అమ్మాయిల మృతదేహాలు
  • శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తుంటే పారిపోయిన కుటుంబీకులు
  • మనీషాను తీసుకెళుతున్న సీసీటీవీ ఫుటేజ్ లభ్యం

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొమ్మల రామారం సమీపంలోని హాజీపూర్ లోని పాడుబడిన వ్యవసాయ బావిలో అమ్మాయిల మృతదేహాలు లభ్యం కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుండగా, బావి యజమాని అయిన శ్రీనివాస్ రెడ్డి ఈ దారుణాలకు ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో హాజీపూర్ గ్రామం నుంచి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం పరారైందని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డిని అనుమానితుడిగా భావించి, విచారణకు తీసుకువెళ్లిన సమయంలో రాత్రిపూట ఇంటికి తాళం వేసి ఇంటి సభ్యులంతా వెళ్లిపోయారని, వారు ఎక్కడికి వెళ్లారన్న విషయాన్ని విచారిస్తున్నామని తెలిపారు.

ఇక మనీషాను శ్రీనివాస్ రెడ్డి తన బైక్ పై ఎక్కించుకుని తీసుకు వెళుతున్న దృశ్యాల ఫుటేజ్ ను ఆయా సీసీటీవీ లను పరిశీలించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లిఫ్ట్ ఇస్తానని తమ ఊరి అమ్మాయిలకు చెప్పి, వారిని ఎక్కించుకుని దారుణాతి దారుణంగా వారిపై హత్యాచారాలు చేసిన శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి తప్పకుండా కఠిన శిక్ష పడేలా చూస్తామని రాచకొండ సీపీ ప్రజలకు హామీ ఇచ్చారు.

More Telugu News