pavithra lokesh: 'గీతాంజలి'లో నాగార్జున గారిని చూసినప్పుడు అలా అనిపించింది: నటి పవిత్ర లోకేశ్

  • అందాల నటిగా పవిత్ర లోకేశ్ కి క్రేజ్
  •  కన్నడలో వరుస సినిమాలు
  •  తెలుగులోనూ ఫుల్ బిజీ

అందమైన అభినయానికి చిరునామాగా పవిత్రలోకేశ్ ను చెబుతారు. తెరపై ఆమెతో కలిసి కనిపించడానికి హీరోయిన్స్ కంగారుపడే గ్లామర్ ఆమెది. ఒకప్పుడు కన్నడలో హీరోయిన్ గా కుర్రకారు మనసులు కొల్లగొట్టేసిన ఆమె, ఇప్పుడు కన్నడతో పాటు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా వున్నారు. ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు 'గీతాంజలి' సినిమాను చూశాను. ఆ సినిమాలో నాగార్జునగారిని చూసిన తరువాత నా జీవితంలోను ఇలాంటి మనిషి వుంటే బాగుంటుంది గదా అనిపించింది. ఒక రకంగా అది ఫస్టు క్రష్ అనుకోవచ్చు. ఆ తరువాత సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ను చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. నాగార్జునగారితో కలిసి నటించడం కుదరలేదుగానీ, ప్రకాశ్ రాజ్ గారితో కలిసి చాలా సినిమాల్లో చేశాను. నాగార్జునగారితో ఇంతవరకూ మాట్లాడలేదు కూడా. ఆయన కనిపించినా మాట్లాడే ధైర్యం చేయలేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News