Telangana: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన బ్రిటన్ రాణి కోడలు సోఫీ హెలెన్!

  • పీడియాట్రిక్, నియోనాటాలజీ వార్డుల పరిశీలన
  • డైమండ్ జూబ్లీ ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్న సోఫీ
  • సేవలను స్వయంగా పరిశీలించేందుకు రాక

తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న గాంధీ ఆసుపత్రికి ఈరోజు అనుకోని అతిథి వచ్చారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కోడలు సోఫీ హెలెన్ ఈరోజు గాంధీ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ వార్డులోని ఎన్‌ఐసీయూ, ఇంక్యుబేటర్‌, ఫ్రీ మెచ్యూర్డ్‌, ఇన్‌బోర్న్‌, అవుట్‌ బోర్న్‌ యూనిట్లతోపాటు నియోనాటాలజీ విభాగాన్ని పరిశీలించారు.

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆధ్వర్యంలో నడిచే డైమండ్ జూబ్లీ ట్రస్ట్ కు సోఫీ హెలెన్ వైస్ ప్యాట్రన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి చిన్న పిల్లల వార్డులో డైమండ్‌ జూబ్లీ ట్రస్ట్‌ అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించేందుకు సోఫీ హెలెన్ విచ్చేశారు.

More Telugu News