Chris Gayle: ఐపీఎల్‌లో రికార్డులకెక్కిన ఆండ్రూ రస్సెల్

  • ముంబైతో మ్యాచ్‌లో రస్సెల్ పరుగుల వేట
  • స్టేడియంలో సిక్సర్ల వర్షం
  • ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 50 సిక్సర్లు

ఐపీఎల్‌లో కోల్‌కతా విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ రికార్డు సృష్టించాడు. ఆదివారం ముంబైతో ఈడెన్ గార్డెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రస్సెల్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి తన పేరున ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రస్సెల్.. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 50 సిక్సర్లు బాదాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రస్సెల్ రికార్డులకెక్కాడు. గతంలో క్రిస్‌గేల్ రెండు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. 2012 సీజన్‌లో 59 సిక్సర్లు కొట్టిన గేల్.. ఆ తర్వాతి ఏడాదిలోనే 51 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన వీరిద్దరూ విండీస్ ప్లేయర్లే కావడం గమనార్హం.

More Telugu News