Nitya Menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ 
  • మహేశ్ స్క్రిప్టు నానికి వెళ్లిందట!
  • శర్వానంద్ ద్విభాషా చిత్రం  

 *  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి నిర్మిస్తున్న భారీ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ మరో పది రోజుల్లో మొదలవుతుంది. కాగా, ఇందులో నిత్యా మీనన్ ఓ పాత్ర పోషించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ కి రెండో హీరోయిన్ గా ఆమె గిరిజన యువతిగా ఇందులో కనిపిస్తుందని సమాచారం.
*  మహేశ్ బాబు కోసం తయారుచేసిన స్క్రిప్టును ఇప్పుడు నాని చేస్తున్నాడు. దర్శకుడు విక్రంకుమార్ దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయాల్సివుంది. అయితే, ఆయన చెప్పిన కథ మహేశ్ కి నచ్చకపోవడంతో, దానిని నానికి వినిపించాడట. నానికి అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఆ విధంగా మహేశ్ సినిమా నానికి వెళ్లిందన్న మాట.    
*  ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తున్న హీరో శర్వానంద్ దీని తర్వాత తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం తమిళంలో సూర్యతో 'ఎన్జీకే' చిత్రాన్ని నిర్మిస్తున్న తమిళ నిర్మాత ఎస్సార్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

More Telugu News