Andhra Pradesh: కడప జిల్లాలో రెండు బైక్ ల ఢీ.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రైడర్లు!

  • జిల్లాలోని మైదుకూరు మండలంలో ఘటన
  • ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న వాహనాలు
  • మృతులను వీరయ్య, చిన్నగా గుర్తించిన పోలీసులు

కడప జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మైదుకూరు మండలం ఎడ్డోడు కనుమ వద్ద ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బైక్ లు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో కలసపాడుకు చెందిన చిన్న(30) అక్కడికక్కడే చనిపోయాడు.

మరోవైపు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరయ్య (35)ను అటుగా వెళుతున్న వాహనదారులు పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరయ్య తుదిశ్వాస విడిచాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News