Karimnagar District: ఒకరినే మనువాడిన అక్కాచెల్లెళ్లు... ఒకేసారి మరణం!

  • కరీంనగర్ జిల్లాలో ఘటన
  • గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరూ మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకే వ్యక్తిని ఇష్టపడ్డారు. పెళ్లాడారు. పెళ్లి తరువాత కూడా వారి మధ్య ఎటువంటి విభేదాలూ రాలేదు. ముగ్గురూ కలిసిమెలసి ఉంటున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, ఈ ఉదయం కరీంనగర్‌ - వరంగల్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

ఓ గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో శంకరపట్నం మండలానికి చెందిన అక్కా చెల్లెళ్లు సుజాత (35), సులోచన (28) అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుని గొడవలు లేకుండా కాపురం చేసుకుంటున్నారని స్థానికులు వెల్లడించారు. ఈ అక్కాచెల్లెళ్ల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు.

More Telugu News