Akuti: కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లకు జన్మనిచ్చిన భారత ఖడ్గమృగం.. ప్రపంచంలోనే తొలిసారి

  • ప్రకృతి సిద్ధమైన ప్రత్యుత్పత్తికి చేసిన ప్రయత్నాలు విఫలం
  • గతేడాది ఓ మగ ఖడ్గమృగం నుంచి వీర్యం సేకరణ
  • 15 నెలల గర్భం తర్వాత మంగళవారం బిడ్డకు జన్మనిచ్చిన అకుటి

మన దేశానికి చెందిన ఖడ్గమృగం అకుటి చరిత్ర సృష్టించింది. ఏడేళ్ల అకుటి కృత్రిమ గర్భధారణ ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా జంతుప్రదర్శన శాలలో ఓ పిల్లకు జన్మనిచ్చింది. ప్రకృతి సిద్ధమైన ప్రత్యుత్పత్తికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించినట్టు జూ అధికారులు తెలిపారు. గతేడాది జనవరి 8న ఓ మగ ఖడ్గమృగం ‘సురు’ నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చెందించినట్టు తెలిపారు. అది విజయవంతమైందని, 15 నెలల గర్భం తర్వాత అది పిల్లకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 23న అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో అది ప్రసవించినట్టు తెలిపారు. కృత్రిమ గర్భధారణ ద్వారా ఓ ఖడ్గమృగం బిడ్డకు జన్మనివ్వడం ప్రపంచంలోనే ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఖడ్గమృగం పిల్ల ఆరోగ్యంగా ఉందని వివరించారు.

More Telugu News