Students: ఓ హోటల్‌లో పార్టీ.. అనంతరం కూకట్‌పల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు

  • పార్టీ సమయంలో విద్యార్థుల మధ్య మనస్పర్థలు
  • ఫార్చూన్ బిజినెస్ స్కూలు విద్యార్థులుగా గుర్తింపు
  • దాడి ఘటనలో ఓ మహిళకు గాయాలు

ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్న విద్యార్థులు.. ఆ సమయంలో వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కలకలం రేగింది. ఫార్చూన్ బిజినెస్ స్కూలు విద్యార్థులు ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు సమాచారం. దీంతో కూకట్‌పల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. విద్యార్థుల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థుల మధ్య గొడవకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

More Telugu News