MPTC: ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలను కేసీఆర్ మోసం చేశారు: వీహెచ్

  • కోర్టు సాకుతో బీసీలను మోసం చేయడం తగదు
  • ‘కాంగ్రెస్’లో బీసీలను గెలిపించి కేసీఆర్ కు కౌంటరివ్వాలి
  • ఫిరాయింపు దారులను తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకుంటే సిగ్గుచేటే

కోర్టు సాకుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోని బీసీలను గెలిపించి కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వాలని పిలుపు నిచ్చారు. పార్టీ ఫిరాయించిన వారిని తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకుంటే పార్టీకే సిగ్గుచేటని అన్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కుంతియాను కోరినట్లు వీహెచ్ చెప్పారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు అనుమతిచ్చే విషయమై జాతీయ స్థాయిలో పోరాడాలన్న వీహెచ్, ఈ విషయంపై తమ పార్టీలో సరైన స్పందన లేదని విమర్శించారు. 

More Telugu News