Keethi Suresh: ఆది పినిశెట్టితో కీర్తి సురేశ్ సినిమా

  • ‘మహానటి’ తరువాత నేరుగా నటించింది లేదు
  • టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్న నగేశ్ 
  • కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు

‘మహానటి’ చిత్రం తరువాత నేరుగా ఒక్క తెలుగు సినిమాలోనూ కీర్తి సురేశ్ నటించలేదు. మలయాళం, హిందీ భాషల్లో ప్రస్తుతం తలో చిత్రాన్ని చేస్తున్న కీర్తి, త్వరలో ఓ తెలుగు సినిమాలోనూ కనిపించనుంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తొలిసారిగా టాలీవుడ్‌కు ఈ చిత్రం ద్వారానే పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా కనిపించనుండగా, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వర్త్ ఎ షాట్ సంస్థ తొలిసారిగా నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసరాల్లో అజ్రుగుతోంది.

More Telugu News