kaleswaram: అది కాళేశ్వరంలో భాగమా? లేక ప్రాణహితలో భాగమా?: పొన్నాల లక్ష్మయ్య

  • ట్రయల్ రన్ పేరుతో హడావుడి చేస్తున్నారు
  • కాంగ్రెస్ హయాంలోనే రూ. 2200 కోట్లు ఖర్చు చేశాం
  • మూడు ప్యాకేజీల పనులు చేయడానికి ఇన్నేళ్లు పట్టింది

ట్రయల్ రన్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదు రోజులుగా హడావుడి చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఇంతకీ అది కాళేశ్వరంలో భాగమా? లేక ప్రాణహితలో భాగమా? చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ హయాంలోనే రూ. 2200 కోట్లు ఖర్చు చేశామని... ప్రాణహిత పేరు మార్చి వ్యయాన్ని రూ. 80 వేల కోట్లకు పెంచారని చెప్పారు. రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారని... మూడు ప్యాకేజీల పనులు పూర్తి చేయడానికి ఇన్నేళ్లు పట్టిందని అన్నారు. ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ పనులు పూర్తయ్యాయని... అయినా కాంగ్రెస్ కు పేరు వస్తుందనే భయంతో ప్రాజెక్టును ప్రారంభించలేదని విమర్శించారు.

More Telugu News