Andhra Pradesh: ఉన్నతాధికారుల వేధింపులు.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన గుంటూరు రైల్వే ఉద్యోగి!

  • గుంటూరు రైల్వేస్టేషన్ లో ఘటన
  • ఉన్నతాధికారుల నుంచి పవన్ కు వేధింపులు
  • ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు

రైల్వేశాఖలో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేని ఓ ఉద్యోగి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు ఆయన్ను కాపాడారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరులోని రైల్వేస్టేషన్ లో పవన్ కుమార్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆయనకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురయిన పవన్ కుమార్ ఈరోజు ఆఫీసుకు వచ్చాడు. అనంతరం ‘ఈ వేధింపులను నేను భరించలేను. చచ్చిపోతా’ అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు.

పక్కనే ఉన్న తోటి ఉద్యోగులు ఈ సందర్భంగా పవన్ ను అడ్డుకున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేయలేదు. బాధితుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News