Telangana: పాతబస్తీలో రౌడీషీటర్ అమీర్ ను రోడ్డుపైనే పొడిచి చంపిన ప్రత్యర్థులు!

  • హైదరాబాద్ లోని మొగల్ పురలో ఘటన
  • పక్కా నిఘా పెట్టి హతమార్చిన ప్రత్యర్థులు
  • నిందితుల కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు

తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీ షీటర్ ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపేశారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. పాతబస్తీ మొగల్ పుర ప్రాంతానికి చెందిన అమీర్ అనే రౌడీషీటర్ కు మరికొందరితో గొడవలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమీర్ కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యర్థులు నిన్న రాత్రి మొగల్ పుర ప్రాంతంలోనే చుట్టుముట్టారని చెప్పారు.

ఈ సందర్భంగా అమీర్ ను ప్రత్యర్థులు మెడ, తల, కడుపు భాగాలలో కత్తులతో పొడిచి పరారయ్యారని అన్నారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

More Telugu News