nithin: 'అవయవదానం' ప్రాధాన్యతతో నితిన్ సినిమా!

  • నితిన్ తాజా చిత్రంగా 'భీష్మ'
  • చంద్రశేఖర్ యేలేటితో తదుపరి సినిమా
  •  కృష్ణచైతన్యతో 'పవర్ పేట'

ప్రస్తుతం నితిన్ 'భీష్మ' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా నిర్మితం కానుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ యేలేటితోను నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే కథావస్తువుతోనే కొనసాగుతుంది.

అయితే 'అవయవదానం' ప్రాధాన్యతను గురించిన సందేశం కథలో అంతర్లీనంగా ఉంటుందని అంటున్నారు. వినోదం పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండానే, సందేశాన్ని హైలైట్ చేస్తూ ఆయన ఈ కథను నడిపించనున్నాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత కృష్ణచైతన్య దర్శకత్వంలోను నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

More Telugu News