Andhra Pradesh: ఏపీలో మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల..ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి: వర్మ

  • ఎన్నికల నేపథ్యంలో ఆగిన విడుదల 
  • ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు  
  • ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులతో ఉన్న పోస్టర్ పోస్ట్

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను కోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఏపీలో మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న ఆంధ్రప్రదేశ్ లో విడుదల కానుందని, ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి అంటూ వర్మ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.‘యన్.టి.ఆర్. అనుభవించిన నరకం!’ అంటూ పోస్ట్ చేసిన పోస్టర్ పై ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు పాత్రధారులు ఉన్నారు.

More Telugu News