Tripura: 'మా ఆయన గృహహింసకు పాల్పడుతున్నాడు' అంటూ త్రిపుర సీఎం భార్యపై తప్పుడు వార్త ప్రచారం!

  • సోషల్ మీడియాలో వైరల్
  • ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసిన సీఎం అర్ధాంగి
  • కేసు నమోదుచేసిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి విషయం నిజమని నమ్మలేని పరిస్థితుల్లో ఏకంగా త్రిపుర సీఎం భార్యపైనే వచ్చిన ఓ పోస్టు సంచలనం సృష్టించింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ తన పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని, హింసిస్తుండడంతో విడాకులు తీసుకుంటున్నానని ఆయన భార్య నీతి దేబ్ పేర్కొంటున్నట్టు ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.

సాక్షాత్తు సీఎం కుటుంబానికి సంబంధించిన వార్త కావడంతో కొద్దిసేపట్లోనే పాకిపోయింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ నీతి దేబ్ స్వయంగా స్పందించారు. ఇలాంటి నీచమైన పుకార్లను పట్టించుకోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరు నీచులు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చవకబారు ఊహాగానాలతో సెలబ్రిటీలపై అవాకులు చెవాకులు పేలుతుంటారని ఆమె మండిపడ్డారు.

దీనిపై వెస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సీఎం భార్యపై పోస్టు పెట్టిన అనుపమ్ పాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News