CM: ఏ ఒక్క అంశంలోనూ సొంత నిర్ణయం తీసుకోవడం లేదు: చంద్రబాబు లేఖపై ద్వివేది స్పందన

  • పార్టీ అభ్యర్థులు, అధికారులకు నియమావళి ఇచ్చాం  
  • ఆ నియమావళి ప్రకారమే పని చేస్తున్నా
  • రాజకీయ అంశాలపై తాను మాట్లాడలేదన్న సీఈవో  

ఈసీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు తొమ్మిది పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీఈవో ద్వివేది స్పందించారు. సీఈసీ నుంచి వచ్చిన ఆదేశాలనే అమలు చేస్తున్నానని అన్నారు. పార్టీలు, అభ్యర్థులు, అధికారులకు నియమావళి పుస్తకాలు అందించామని, ఆ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నానని, ఏ ఒక్క అంశంలోనూ సొంత నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై తాను మాట్లాడలేదని, ఇతర రాష్ట్రాల్లో ఈసీ అధికారుల విషయాన్ని సీఈసీ చూసుకుంటుందని అన్నారు.

More Telugu News