Rajanna Sircilla District: వేములవాడ రూరల్ లో ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

  • జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ లేదు
  • హైకోర్టును ఆశ్రయించిన వేములవాడ ఎంపీపీ
  • ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల పరిధిలో ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని, ఈ విషయమై పున: పరిశీలించాలని కోరుతూ వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేములవాడ రూరల్ లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ స్టే విధించింది.

More Telugu News