chevella: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
  • నిన్న నాంపల్లి కోర్టులో కొండాకు చుక్కెదురు
  • విశ్వేశ్వర్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు

పోలీసులను నిర్బంధించారన్న ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం నిన్న నాంపల్లి కోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

More Telugu News