Vijay Sai Reddy: నాలుగు వారాలు ఆగు ఉమా... నీ బండారం బయటకు వస్తుంది: విజయసాయి రెడ్డి

  • దేవినేని అరాచకం బయటకు వస్తుంది
  • బాధితులు స్వయంగా ఫైళ్లను తెస్తున్నారు
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి

మరో నాలుగు వారాలు ఓపిక పడితే, నీటి పారుదల శాఖలో దేవినేని ఉమ నడిపించిన అరాచకం బయటకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్టర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?" అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.




More Telugu News