tirupati puri express: తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

  • కృష్ణా జిల్లా మండవల్లి మండలం భైరవపట్నం వద్ద విరిగిన పట్టా
  • సకాలంలో గుర్తించిన కీమెన్
  • అరగంట ఆలస్యంగా బయల్దేరిన రైళ్లు

తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విరిగిన రైలు పట్టాను కీమెన్ సకాలంలో గుర్తించి, అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మండవల్లి మండలం భైరవపట్నం దగ్గర రైలు పట్టా విరిగిపోయింది. ఈ విషయాన్ని కీమెన్ బ్రిమ్ మోహన్ గుర్తించాడు. తాత్కాలిక మరమ్మతులు చేసిన తర్వాత రైలును పంపించారు. ఈ నేపథ్యంలో, తిరుపతి-పూరి, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ లు అరగంట ఆలస్యంగా బయల్దేరాయి. 

More Telugu News