Hyderabad: ప్రియురాలు మాట్లాడటం లేదని... ఉరేసుకున్న కుర్రాడు!

  • ఇటీవలే టెన్త్ రాసిన నరేశ్
  • వారం నుంచి మాట్లాడని బాలిక
  • మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య

తాను ప్రేమిస్తున్న అమ్మాయి మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్, ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన యాదయ్య కుమారుడు నరేశ్ (16), ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో చాంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.

23వ తేదీన పనికి వెళ్లిన నరేష్‌, తనకు నైట్‌ షిప్ట్‌ ఉందని, ఇంటికి రాలేనని చెప్పాడు. 24 ఉదయం తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లగా, సాయంత్రం 5 గంటల సమయంలో నరేశ్ ఇంటికి వచ్చాడు. ఆపై కాసేపటికి తల్లి వచ్చి తలుపులు తట్టినా స్పందించలేదు. స్థానికుల సహాయంతో తలుపులు తీసి చూడగా, నరేష్‌ ఉరేసుకొని కనిపించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కొంతకాలంగా ఓ బాలికతో నరేష్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమె ప్రస్తుతం మాట్లాడటం లేదని, అందువల్లే నరేశ్ సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. చెడు స్నేహాల కారణంగానే తమ కుమారుడు దూరమయ్యాడని యాదయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News