Tirumala: భక్త జనులతో తిరుమల గిరులు కిటకిట... దర్శనానికి 24 గంటల సమయం!

  • మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న విద్యార్థులు
  • వేచి చూస్తున్న భక్తులకు అన్న పానీయాలు
  • వెల్లడించిన టీటీడీ అధికారులు

దేవదేవుడు కొలువైన తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడికావడంతో మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, క్యూ లైన్ వెలుపలికి విస్తరించింది.

 స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ టోకెన్, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రసాదం కౌంటర్లు, అన్ని క్యూలైన్లు, మాడ వీధులు భక్తుల రద్దీతో కనిపిస్తున్నాయి. దర్శనానికి వేచి చూస్తున్న భక్తులకు అన్న పానీయాలను సమకూరుస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం నాడు స్వామివారిని 67,542 మంది భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News