Banglore: రైలు ఇంజిన్ ఎక్కి హైవోల్టేజి కరెంటు వైర్లు పట్టుకున్న వ్యక్తి.. వీడియో ఇదిగో

  • బెంగళూరులో ఘటన
  • ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అరిచిన వ్యక్తి
  • మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు

బెంగళూరులో పట్టపగలు ఓ వ్యక్తి రైలు ఇంజిన్ పైకి ఎక్కి హైటెన్షన్ కరెంటు వైర్లు పట్టుకోవడం సంచలనం కలిగించింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులతో చెప్పిన ఆ వ్యక్తి అన్నంత పనీ చేశాడు. అక్కడే ఆగి ఉన్న రైలు ఇంజిన్ పైభాగానికి చేరుకుని, రెండు సార్లు హైఓల్టేజ్ వైర్లను తాకాడు. దాంతో పెద్దఎత్తున మంటలు రేగాయి. రెండోసారి పట్టుకున్న తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిమరణించాడు. ఇది చూసిన జనాలు బెంబేలెత్తిపోయారు.

అంతకుముందు అతడు రైలు ఇంజిన్ పైకి ఎక్కుతుండగా ఎవరూ అడ్డుకోలేకపోయారు. చాలామంది ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి మానసిక స్థితిపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మతిస్థిమితం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

More Telugu News