Supreme Court: అంతర్గత విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

  • రంజన్ గొగోయ్, రమణలు కుటుంబ స్నేహితులు
  • అందువల్ల నాకు న్యాయం జరగదు
  • లైంగిక ఆరోపణలు చేసిన మహిళ వ్యాఖ్య 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముగ్గురు న్యాయమూర్తులతో అంతర్గత విచారణా కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందిరా బెనర్జీ తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. అయితే, ఈ కమిటీ నుంచి ఎన్వీ రమణ తప్పుకున్నారు. రంజన్ గొగోయ్, రమణలు కుటుంబ స్నేహితులని, అందువల్ల ఈ విచారణలో న్యాయం జరగదని లైంగిక ఆరోపణలు చేసిన సుప్రీం మాజీ మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఆ కమిటీ నుంచి రమణ తప్పుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు  ఎన్వీ రమణ ఓ లేఖ రాశారు.

More Telugu News