Guntur: సైలెన్సర్ తీసేసి వాహనాలు నడిపే వారిపై కేసులు.. గుంటూరు పోలీసుల హెచ్చరిక!

  • గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల  ప్రత్యేక డ్రైవ్
  • అదుపులో స్నేక్, ఫైర్ కటింగ్ డ్రైవ్ చేసిన చోదకులు  
  • సైలెన్సర్లు తీసి వేసే మెకానిక్ లపైనా చర్యలు

గుంటూరులో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్నేక్, ఫైర్ కటింగ్ డ్రైవ్ చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ సుప్రజ మాట్లాడుతూ, సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, అదేవిధంగా, వాహనాలకు సైలెన్సర్లు తీసి వేసే మెకానిక్ లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More Telugu News