Sri Lanka: శ్రీలంకలో ఈరోజు మరో బాంబు పేలుడు

  • కొలంబోకు సమీపంలోని పుగోడా పట్టణంలో పేలుడు
  • కోర్టు వెనకున్న ఖాళీ స్థలంలో పేలిన బాంబు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఉగ్రదాడులతో ఇప్పటికే రక్తసిక్తమైన శ్రీలంకలో బాంబు పేలుళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోకు సమీపంలో తూర్పు వైపున ఉన్న పుగోడా పట్టణంలో ఈరోజు మరో పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మాట్లాడుతూ, పుగోడాలోని మేజిస్ట్రేట్ కోర్టు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 359 మంది ప్రాణాలు కోల్పోయారు. 

More Telugu News