rajani'nayanatara: రజనీ 'దర్బార్'లో నివేదా థామస్

  • రజనీకాంత్ కథానాయకుడిగా 'దర్బార్'
  • కథానాయికగా నయనతార
  •  రజనీ కూతురు పాత్రలో నివేదా థామస్

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ముందుగా రజనీకాంత్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత ఈ సినిమా షూటింగులో నయనతార జాయిన్ అయింది. ఈ సినిమాలో నివేదా థామస్ కూడా నటిస్తున్నటుగా వార్తలు వచ్చాయి.

ఆమె కూడా ఈ సినిమా షూటింగులో జాయిన్ అయిందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ కూతురు పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి ప్రాధాన్యత ఉండటం వల్లనే నివేదా ఒప్పుకుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. రజనీకాంత్ ను ఎదుర్కునే ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News