Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘జనసేన’ సింబల్ మార్పు

  • జెడ్పీ టీసీ ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తే 
  • ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తు ‘క్రికెట్ బ్యాట్’
  • ఈ మార్పును ఓటర్లు గమనించాలి: జనసేన

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సింబల్ కు సంబంధించి ఒక మార్పు జరిగింది. జెడ్పీ టీసీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తునే కేటాయించినప్పటికీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం ‘క్రికెట్ బ్యాట్’ గుర్తును ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మార్పును ఓటర్లు, పార్టీ శ్రేణులు గమనించాలని జనసేన తెలంగాణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జనసేన ఓ ట్వీట్ చేసింది. కాగా, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు విడతలలో జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, మే 27న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

More Telugu News