apoorva: నా కుమారుడిని పెళ్లి చేసుకోక ముందే అపూర్వకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది: ఎన్డీ తివారీ భార్య

  • మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా రోహిత్, అపూర్వలు కలుసుకున్నారు
  • వారి దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదు
  • ఆమె కుటుంబానికి డబ్బే ప్రధానం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తన భార్య అపూర్వ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వలాశర్మ పలు వివరాలను వెల్లడించారు. అపూర్వ సుప్రీంకోర్టులో లాయర్ గా పని చేస్తోందని ఆమె తెలిపారు. ఒక మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా 2017లో రోహిత్, అపూర్వలు లక్నోలో తొలిసారి కలుసుకున్నారని చెప్పారు. ఒక ఏడాది పాటు ఒకరినొకరు కలుసుకునేవారని... ఆ తర్వాత దూరమయ్యారని తెలిపారు. ఉజ్వలను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రోహిత్ ఆమెకు దూరంగా ఉన్నాడని చెప్పారు. 2018 జనవరి నుంచి మార్చ్ వరకు వాళ్లిద్దరూ టచ్ లో లేరని తెలిపారు.

గత ఏడాది ఏప్రిల్ 2న ఇద్దరూ తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్పారని ఉజ్వల అన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నా వారి దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదని చెప్పారు. తరచుగా గొడవపడేవారని తెలిపారు. విడాకులు తీసుకునే విషయంపై ఎన్నో సార్లు చర్చించుకున్నారని... చివరకు విడిపోవాలనే నిర్ణయానికి జూన్ లో వచ్చారని తెలిపారు. పెళ్లికి ముందే అపూర్వకు మరో వ్యక్తితో సంబంధం ఉందని చెప్పారు. ఆమె కుటుంబానికి డబ్బే ప్రధానమని, తమ ఆస్తిపై కన్నేశారని అన్నారు. డిఫెన్స్ కాలనీలోని తమ ఆస్తిని కాజేయాలనుకున్నారని తెలిపారు. 

More Telugu News