mahesh babu: తనతో పనిచేసిన దర్శకులందరినీ ఆహ్వానించిన మహేశ్ బాబు

  • మే 9న మహేశ్ 25వ చిత్రం 'మహర్షి' విడుదల
  • పీపుల్స్ ప్లాజాలో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్
  • గత 24 చిత్రాల దర్శకులకు మహేశ్ ఆహ్వానం

మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ చిత్రం మహేశ్ బాబుకు 25వది కావడంతో వేడుకను అట్టహాసంగా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. మహేశ్ గత 24 చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్లందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే కనువిందు చేయనుంది.

More Telugu News