alari subhashini: నాకు కేన్సర్ అనగానే స్పందించిన మొదటి వ్యక్తి నాగబాబుగారు: 'అల్లరి' సుభాషిణి

  • ఆర్ధికంగా చితికిపోయాను 
  • కేన్సర్ రూపంలో అనారోగ్యం 
  • ఆర్టిస్టులంతా సాయం చేశారు  

'అల్లరి' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన హాస్యనటి సుభాషిణి. ఆ సినిమా ఆమెకి మంచి పేరు తీసుకురావడంతో, 'అల్లరి' సుభాషిణిగా అనేక చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆమె కేన్సర్ బారిన పడ్డారు. ట్రీట్మెంట్ తరువాత కోలుకుంటున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు.

"ఆర్ధికంగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడే కేన్సర్ వచ్చింది. నా నుంచి సాయం పొందినవారు ముఖం చాటేశారు. అలాంటి పరిస్థితుల్లో సన్నిహితుల సూచనమేరకు, నాకు సాయం చేయమని కోరుతూ యూట్యూబ్ లో  వీడియో పెట్టాను. ఆ వీడియోను చూడగానే ముందుగా నాగబాబు స్పందించారు. ఫోన్ చేసి పలకరించడమే కాకుండా, ఆ మర్నాడే 50 వేలు పంపించారు. ఇక నటి రజిత పూనుకుని చాలా మంది ఆర్టిస్టులకి నా పరిస్థితి చెప్పి ఒక లక్షరూపాయలు పోగు చేసి ఇచ్చింది. ఆ తరువాత చిరంజీవిగారు .. శివాజీరాజా గారు కూడా కొంత డబ్బు పంపించారు. ఇలా ఆర్టిస్టులంతా కలిసి నన్ను బతికించుకున్నారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

More Telugu News