Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ సక్సెస్ నేపథ్యంలో.. కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన హరీశ్ రావు

  •  ఉవ్వెత్తున ఎగసిపడ్డ నీళ్లు 
  • ఇంజనీర్లను అభినందించిన హరీశ్
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6లోని మోటార్ పంపు వెట్ రన్ ను ఈరోజు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఈ మోటార్ ను ప్రారంభించారు. దీంతో నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సాగునీటిశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ఈ ప్రాజెక్టు వెట్ రన్ ను విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ శుభ సందర్భాన తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు హరీశ్ రావు ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News